యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ పునర్నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ప్రధానాల యం, శివాలయం పనులు పూర్తి కాగా భక్తులకు కల్పించే వసతులపై వైటీడీఏ అధికారులు దృష్టి సారించారు. ముఖ్యమం త్రి కేసీఆర్ సంకల్పంతో ప్రపంచమే అబ్బుపడే విధంగా యాదాద్రి ఆలయ నిర్మితమైన నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఆల యానికి వచ్చే భక్తుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉండడంతో అందుకనుగుణంగా వసతులు కల్పిస్తున్నారు. ము ఖ్యంగా స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల నిమిత్తం నిర్మించే క్యూకాంఫ్లెక్స్ పనులు శరవేగంగా సాగుతున్నాయి.
కాంఫ్లెక్స్కు ఆద్యాత్మిక హంగులు తీర్చిదిద్దడంతోపాటు క్యూలైన్లు కొండపైకి వరకు వెళ్లే విధంగా నిర్మాణాలు సాగుతున్నా యి. ఇప్పటికే స్వామి వారి ప్రధానాలయంలోని తూర్పు రాజగోపురం ముందు బిగించిన స్వర్ణ వర్ణపు క్యూలైన్లకు భక్తులు వెళ్లే విధంగా పనులు చేపట్టారు. ఇందులో భాగంగా క్యూ కాంప్లెక్స్ నుంచి ప్రసాద విక్రయాల భవనాలను కలుపుతూ ఇనుప రాడ్లతో స్లాబ్ నిర్మిస్తున్నారు. క్యూ కాంప్లెక్స్ నుంచి స్లాబ్ కింద నిర్మిస్తున్న ర్యాంప్ నుంచి క్యూలైన్లోకి భక్తులు వెళ్లేలా పనులు సాగుతున్నాయి.
భక్తులకు ప్రత్యేక ఎస్కలేటర్..
యాదాద్రీశుడిని దర్శించుకునే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల దర్శించుకునేందుకు వచ్చే వృద్ధులు, వికలాంగులు, నడవరాని స్థితిలో ఉన్న భక్తుల కోసం ఎస్కలేటర్(కదిలే మెట్లు) లను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. క్యూ కాంప్లెక్స్లో మొదటి అంతస్థు నుంచి ప్రసాద విక్రయభవనం వరకు ఎస్కలేటర్ల నిర్మాణం చేపట్ట గా పనులు సాగుతున్నాయి. మొత్తం మూడు ఎస్కలేటర్లు బిగించాల్సి ఉండగా ఇప్పటికే ఒక ఎస్కలేటర్ యాదాద్రికి రాగా, మరో రెండు త్వరలో రానున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
యాదాద్రికి చేరిన పూల కుండీలు..
ఆలయ ప్రాంగణంలో మొక్కలతో పాటు రంగు రంగుల పూల మొక్కలను పెంచే విధంగా ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు. యాదాద్రి ప్రదానాలయంతో పాటు మెట్లు, ఇతర ఖాళీ ప్రదేశాల్లో పూల మొక్కలు నాటేందుకు పాండిచ్చేరిలో ప్రత్యేకంగా తయారు చేయించిన పూల కుండీలను తీసుకురాగా, తాజాగా మట్టితో తయారు చేసిన మరిన్ని కుండీలను అధికారులు తీసుకువచ్చారు. వీటిలో వివిధ రకాల అందమైన పూల మొక్కలను భక్తులకు ఆహ్లాదాన్ని పంచే విధంగా ఏర్పాటు చేసేందుకు వైటీడీఏ అధికారులు చర్యలు చేపట్టారు.