KCR | తెలంగాణలో ప్రస్తుతం నడుస్తున్నది దేవుడి మీద ఒట్లు.. కేసీఆర్ మీద తిట్లు అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి, ఇతరులు వాగ్ధానాలు నెరవేర్చలేక.. పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి తప్పదని ఇలా తమ ఫ్రస్టేషన్ను చూపిస్తున్నాయని అన్నారు. మరోవైపు కాంగ్రెస్ సభలు అన్నీ అట్టర్ప్లాఫ్ అవుతున్నాయని పేర్కొన్నారు. ఓ మీడియా ఛానల్లో బిగ్ డిబేట్లో పాల్గొన్న కేసీఆర్.. కాంగ్రెస్, బీజేపీది రాజకీయ వికృత క్రీడ అని విమర్శించారు. కాంగ్రెస్ అడ్డగోలు హామీలు ఇచ్చిందని.. ప్రజలు మోసపోయి కాంగ్రెస్ను గెలిపించారని తెలిపారు. కేసీఆర్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ అని చెప్పారు. కేసీఆర్ను తగ్గించాలని చాలామంది ప్రయత్నాలు చేసి భంగపడ్డారని అన్నారు. నేను పెరగాల్సిన ఎత్తు పెరిగాను.. నన్ను తగ్గించడమనేది ఉండదు. ఇది కాంగ్రెస్, బీజేపీ చిలిపి రాజకీయ క్రీడ అని ఆయన పేర్కొన్నారు.
అజ్ఞానం, అహంకారపూరితంగా కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తున్నారని కేసీఆర్ అన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని ముఖ్యమంత్రి శాసనసభలో అన్నారని గుర్తు చేశారు. ఆ ఆలోచన ఎంతటి వికృతమైందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ 10 ఏండ్లు అధికారంలో లేదు.. ఆ పార్టీ పోయిందా? అని ప్రశ్నించారు. ఎవరి టైమ్ కోసం వాళ్లు వెయిట్ చేస్తుంటారు. కచ్చితంగా వాళ్ల టర్న్ వస్తుంది. ప్రజల్లో మార్పు వచ్చినప్పుడు. వాళ్ల ఆలోచన సరళి మారుతుంది. కృతిమ్రంగా చేసే ఆరోపణలు, ఇటువంటి ప్రయత్నాలు బెడిసికొడతాయని అన్నారు. ఇలాంటివి ఎప్పుడు చరిత్రలో ఎప్పుడు సక్సెస్ కాలేదని.. ఇప్పుడు కూడా కావని అన్నారు.
‘రాజకీయాల్లో కొన్ని సందర్భాలు ఉంటాయి. విలీనం చేస్తామని చెప్పిన మాట వాస్తవం.. నేను చెప్పిన మాట వాళ్లు విననది వాస్తవం. జూన్ 2వ తేదీన అపాయింట్మెంట్ డే పెట్టారు. రెండు రాష్ట్రాలు అయిపోయిన తర్వాత కంబైన్డ్ స్టేట్లో ఎన్నికలు పెట్టడం కరెక్ట్ కాదు.. ఇది తలాతోక లేని వ్యవహారం అని చెప్పా. కానీవాళ్లు వినలేదు. తదనననంతరం నేను విలీనం చేయడానికి ఒప్పుకోలేదు. ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచాం..అధికారంలోకి వచ్చాం.. ఇప్పుడు వాళ్లు అధికారంలోకి వచ్చారని అన్నారు.’ అని అన్నారు.