Gold-Diamond Seize | మహారాష్ట్ర రాజధాని ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న రూ.6.46 కోట్ల విలువైన బంగారం, వజ్రాలను కస్టమ్స్ అధికారులు సోమవారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికులు న్యూడుల్స్ ప్యాకెట్లు, లోదుస్తుల్లో బంగారం, వజ్రాలను తరలిస్తున్నారు. రూ.4.44 కోట్ల విలువైన 6.8 కిలోల బంగారం, రూ.2.02 కోట్ల విలువైన వజ్రాలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో సదరు నలుగురు ప్రయాణికులను కస్టమ్స్ అధికారులను అరెస్ట్ చేశారు.
శ్రీలంక రాజధాని కొలంబో నుంచి ముంబైకి వచ్చిన ఒక విదేశీ ప్రయాణికుడిని తనిఖీ చేసినప్పుడు ఆయన లోదుస్తుల్లో బంగారం బార్లు దొరికాయి. దీని బరువు 321 గ్రాములు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. మొత్తం పది మంది ప్రయాణికుల్లో ఇద్దరేసి వ్యక్తులు దుబాయ్, అబుదాబీలకు, బహ్రెయిన్, దోహా, రియాద్, మస్కత్, బ్యాంకాక్, సింగపూర్ నగరాలకు ఒక్కొక్కరు చొప్పున వెళుతున్నారని కస్టమ్స్ అధికారులు తెలిపారు. వారిలో ముగ్గురు ప్రయాణికులను తనిఖీ చేసినప్పుడు 6.199 కిలోల బంగారం దొరికిందని చెప్పారు. దీని విలువ రూ.4.04 కోట్లు ఉంటుందని తెలిపారు.