యాదగిరిగుట్ట, జనవరి 24 : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి 20 రోజుల హుండీల ఆదాయం రూ.కోటిన్నర దాటింది. మంగళవారం కొండకింద గల సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో హుండీలను లెక్కించగా రూ.1,84,84,891 నగదు వచ్చిందని ఆలయ ఈవో ఎన్ గీత తెలిపారు.
దాంతోపాటు 144 గ్రాముల మిశ్రమ బంగారం, 2 కిలోల 850 గ్రాములు మిశ్రమ వెండి సమకూరినట్టు ఆమె పేర్కొన్నారు. ఎక్కువ మొత్తంలో విదేశీ కరెన్సీ వచ్చిందన్నారు.