భువనగిరి అర్బన్, మే 16: యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని ఎర్రంబెల్లికి చెందిన పడమటి అన్విత ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించింది. ఏప్రిల్ 10న భువనగిరి నుంచి బయల్దేరిన ఆమె 12న నేపాల్కు చేరుకున్నది.
అక్కడ నెలపాటు ప్రత్యేక శిక్షణ తీసుకున్నది. అనంతరం ఈ నెల 12న ఎవరెస్టును అధిరోహణకు బయల్దేరింది. సోమవారం ఉదయం 9:30 గంటలకు ఎవరెస్టు శిఖరంపైకి చేరుకున్నది. ఈ నెల 18న ఎవరెస్టు కింద ఉండే బేస్ క్యాంపునకు తిరిగి చేరుకోనున్నది.