యాదాద్రి: యాదాద్రీశుడి దర్శించుకునే భక్తులకు సకల వసతులు కల్పిస్తూ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆల య పునర్నిర్మాణాలు సాగుతున్నాయి. స్వాతి నక్షత్రంలో భాగంగా గిరి ప్రదక్షిణ చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వైటీడీఏ అధికారులు మెరుగులు దిద్దుతున్నారు.
ఇప్పటికే గిరి ప్రదక్షిణ రోడ్డు ఇరువైపులా ఆహ్లదాన్ని పెంచే మొక్కలు, గార్డెనింగ్తో పాటు మెట్ల నిర్మాణాలు చేపట్టగా సోమవారం రోడ్డుకు పార్కింగ్ టైల్స్ను బిగిస్తున్నారు.
స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజున గుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేసే భక్తుల ఇబ్బందులు లేకుండా టైల్స్ను నిర్మిస్తున్నారు. సుమారు 2.5 కిలోమీటర్ల వరకు టైల్స్ నిర్మించడంతో పాటు సేద తీరేందుకు అక్కడక్కడ సిమెంట్తో తయారు చేసిన బెంచీలను అందుబాటులోకి తీసుకువచ్చారు.