నవ్య యాదాద్రిని ముఖ్యమంత్రి కేసీఆర్ జాతికి పునరంకితం చేశారు. జయజయ ధ్వానాల మధ్య ప్రధాన ఆలయ ప్రవేశం జరిగింది. మహాకుంభ సంప్రోక్షణ క్రతువు శాస్రోక్తంగా ముగిసింది. సోమవారం నుంచే యాదాద్రి శ్రీ లక్ష్మీనృసింహ స్వామి దర్శనాలు కూడా ప్రారంభమయ్యాయి. అయితే.. రోజువారీ సేవలు, దర్శనాల సమయాలపై యాదాద్రి దేవస్థానం ఓ ప్రకటన చేసింది. ప్రతి రోజూ ఉదయం 3 గంటలకు సుప్రభాత సేవతో ఆయల ద్వారాలు తెరుచుకుంటాయి. 3ః30 నిమిషాల వరకూ ఈ సేవ కొనసాగుతుంది. ఇక 3ః30 నిమిషాల నుంచి 4 గంటల వరకూ స్వామి వారి ఆరాధన జరుగుతుంది.
ఆ తర్వాత 4 గంటల నుంచి 4ః30 నిమిషాల వరకూ బాలభోగం ఉంటుంది. ఆ తర్వాత 4ః30 నిమిషాల నుంచి 5ః30 వరకూ స్వామి వారికి నిజాభిఫేకం వుంఉటంది. 5ః30 నిమిషాల నుంచి 5ః45 నిమిషాల వరకూ స్వామి వారికి అలంకరణ. 5్45 నిమిషాల నుంచి 6ః30 నిమిషాల వరకూ స్వామి వారికి సహస్ర నామార్చన. తిరువారాధన 7 నుంచి 7ః30 నిమిషాల వరకు. ఇక రాజభోగాన్ని మధ్యాహ్నం 12 గంటల నుంచి 12ః45 నిమిషాల వరకు సమర్పిస్తారు.
ఇక.. ఉచిత దర్శనాలు 6ః30 నిమిషాల నుంచి 8 గంటల వరకూ… 9 గంటల నుంచి 12 గంటల వరకూ. 12ః45 నిమిషాల నుంచి 4 గంటల వరకూ.. 8ః15 నిమిషాల నుంచి 9ః15 నిమిషాల వరకూ కొనసాగుతాయి. ఇక వీఐపీ బ్రేక్ దర్శనాలు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు. తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు. ఆరగింపు సేవ 9ః15 నిమిషాల నుంచి 9ః45 నిమిషాల వరకు. చివరగా… శయనోత్సవం జరుగుతుంది. దీంతో 10 గంటలకు ఆలయం మూతపడుతుంది.