యాదాద్రి: యాదాద్రి (Yadadri) శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు (Yadadri Brahmotsavam) అంగరంగవైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రోజుకో అవతారంలో యాదగిరీశుడు దర్శనమిస్తున్నాడు. ఆరో రోజైన నేడు గోవర్ధనగిరిధారి (Govardhana Giridhari) అలంకారంలో లక్ష్మీనారసింహుడు (Sri Lakshmi Narasimha swamy) దర్శనమిచ్చారు. ఆలయ తిరుమాడ వీధుల్లో స్వామివారిని ఊరేగించారు. స్వామివారిని చూసిన భక్తులు భక్తితన్మయంతో ఉప్పొంగిపోయారు. రాత్రికి అశ్వవాహనంపై ఎదుర్కోలు నిర్వహిస్తారు.
ఈనెల 28న తిరుల్యాణ మహోత్సవం, మార్చి 1న దివ్య విమాన రథోత్సవం, శ్రీమహావిష్ణువు అవతారంలో గరుడవాహన సేవ, రాత్రికి ప్రధానాలయం తిరువీధుల్లో రథోత్సవం, 2న ఉదయం మహాపూర్ణాహుతి, చక్రతీర్థం, రాత్రికి శ్రీపుష్పయాగం, దోపోత్సవం నిర్వహిస్తారు. ఉత్సవాల చివరి రోజు 3న ఉదయం అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రికి శృంగార డోలోత్సవంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి.