యాదాద్రి భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన విద్యార్థులు ఉక్రెయిన్లో చిక్కుకున్నారు. గంజి భాను ప్రసాద్, ముడుంబాయ్ ఫణిచంద్ర.. ఉక్రెయిన్లోని ఓ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ విద్యను అభ్యసిస్తున్నారు. ఫణిచంద్ర ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్, భాను ప్రసాద్ ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతున్నారు.
ఈ ఇద్దరు విద్యార్థులు స్వదేశానికి వచ్చేందుకు నిన్న ఏర్పాట్లు చేసుకున్నారు. నిన్న రాత్రి ఇండియాకు బయల్దేరేందుకు ఉక్రెయిన్ రాజధాని కీవ్ ఎయిర్పోర్టుకు వచ్చారు. అంతలోనే రష్యా బాంబు దాడులు చేయడంతో భయంతో ఈ ఇద్దరు వెనుదిరిగారు. ఫణిచంద్ర, భానుప్రసాద్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.