యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో మంగళవారం క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామిని ఆరాధిస్తూ ఆకు పూజ చేపట్టారు. విష్ణు పుష్కరిణి చెంత గల గుడిలో హనుమంతుడిని సింధూరంతో అలంకరించి అభిషేకించారు. తమల పాకులతో అర్చన చేపట్టారు. వేదమంత్రాల మధ్య జరిగిన పూజల్లో పలువురు భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నా రు. లలితాపారాయణం చేసి, ఆంజనేయస్వామికి ఇష్టమైన వడపప్పు. బెల్లం, అరటి పండ్లను నైవేధ్యంగా సమర్పించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
యాదాద్రీశుడికి వైభవంగా నిజాభిషేకం
యాదాద్రి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో నిత్యపూజలు ఉదయం 4 గంటల నుంచి ప్రారంభమయ్యా యి. సుప్రభాత సేవ మొదలుకుని నిజాభిషేకం వరకు కోలాహలంగా పూజలు కొనసాగాయి. శ్రీవారి నిత్య కల్యాణం నిర్వ హించారు. నిత్యపూజల్లో భాగంగా బాలాలయ మండపంలో లక్ష్మీ నరసింహుల నిత్యకళ్యాణం శాస్ర్తోక్తంగా నిర్వహించారు. తొలుత సుదర్శన నారసింహ హోమం నిర్వహించారు.
మహా మండపంలో అష్టోత్తరం నిర్వహించారు. సాయంత్రం వేళ అలంకార సేవోత్సవాన్ని సంప్రదాయంగా నిర్వహించారు. అలంకార సేవోత్సవంలో పాల్గొన్న భక్తులకు స్వామి,అమ్మవార్ల ఆశీస్సులు అందజేశారు. శ్రావణమాసం సందర్భంగా వ్రతాలు భారీగా జరిగాయి. సత్యనారాయణ స్వామి వ్రతాల్లో భక్తుల పాల్గొని వ్రతాలాచరించారు. పాతగుట్టలో లక్ష్మీ నరసింహస్వామి వారి నిత్యపూజలు ఆలయ సంప్రదాయ రీతిలో కొనసాగాయి.