యాదాద్రి: లక్ష్మీనరసింహస్వామి వారి బాలాలయంలో శ్రీస్వామి, అమ్మవార్లకు అర్చకులు సంప్రదాయ పూజలు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఉదయం సుప్ర భాతంతో స్వామి, అమ్మవార్లను మేల్కొలిపిన అర్చక బృందం ఉత్సవ మూర్తులకు పంచామృతాలతో అభిషేకించి, పట్టు వస్ర్తాలను ధరింపజేసి వివిధ రకాల పుష్పాలతో ఆలంకరించారు. వేకవజామున ఆరాధన, సహస్త్రనామార్చన, సువర్ణపుష్పార్చన వంటి నిత్య కైంకర్యాలను నిర్వహించారు.
ఉదయం 8 గంటలకు నిర్వహించిన సుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం జరిపారు. ప్రతిరోజూ నిర్వహించే నిత్య తిరుకల్యాణోత్సవం లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవేరు లను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు. లక్ష్మీసమేతుడై న నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణ తంతును జరిపారు.
ఆలయంలో దర్శనం అనంతరం రూ. 100 చెల్లించి అతి తక్కువ సమయంలో జరుపుకునే అష్టోత్తర పూజలు పెద్ద ఎత్తు న జరిగాయి. శ్రావణమాసం పురస్కరించు కుని భక్తులు సత్యనారాయణ స్వామివ్రతాల్లో పాల్గొని వ్రతాలచరించారు. సత్య నారాయణుడికి కొలుస్తూ ప్రత్యేక పూజలు చేపట్టారు. కొండకింద గల పాత గోశాల వద్ద వసతిగృహంలో వ్రతాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.