
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో బుధవారం స్వామి వారికి నిత్యకైంకర్యాలు శాస్ర్తోక్తంగా చేపట్టా రు. ఉదయం సుప్రభాతంతో స్వామిని మేల్కొ లిపిన అర్చకులు స్వయంభువులకు పంచామృతాలతో అభిషేకం నిర్వహిం చారు. స్వామి వారి బాలాలయ కవచమూర్తులకు ఆరాధనలు జరిపారు. ఉత్సవ మండపంలో ఉత్సవ విగ్రహాలను పట్టు వస్ర్తాలు, స్వర్ణ అభరణాలతో అలంకరించి నిజాభిషేకం, తులసీ అర్చనలు చేపట్టారు.
లక్ష్మీనరసింహులను దివ్య మనోహరంగా అలంకరించి సుదర్శన నార సింహహోమం, నిత్య తిరుకల్యాణం, అలంకార సేవోత్సవాలు నిర్వహించారు. మండపంలో అష్టోత్తర పూజలు జరిపారు. కొండపైన శివాలయంలో నిత్యారాధనలు శైవ సంప్రదాయంగా జరిగాయి. అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు.
వైభవంగా వ్రత పూజలు
శ్రావణమాసం సందర్భంగా ఆలయంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరుపుకునే సామూహిక సత్యనారాయణ స్వామి వారి వ్రతాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్వామిని ఆరాధిస్తూ భక్తి శ్రద్ధలతో పూజలు చేపట్టారు.
స్వామిని దర్శించుకున్న రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి.
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారిని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు ఆయనకు స్వామి వారి ఆశీర్వచనం, తీర్ధప్రసాదాలు అందజేశారు.
