హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రెడ్కో చైర్మన్గా వై సతీశ్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవిలో సతీశ్ రెడ్డి మూడేండ్ల పాటు కొనసాగనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు ఆరూరి రమేశ్, దానం నాగేందర్తో పాటు పలువురు పాల్గొన్నారు. బాధ్యతల స్వీకరణ అనంతరం సతీశ్ రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
సతీష్ రెడ్డి 1981, ఆగస్టు 25న ములుగు మండలం దేవగిరిపట్నంలో జన్మించారు. ప్రస్తుతం హైదరాబాద్లోని వనస్థలిపురంలో నివాసం ఉంటున్నారు. బీటెక్(ఈసీఈ) చదివారు. టీఆర్ఎస్ పార్టీలో విద్యార్థి నాయకుడిగా చేరి.. ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. 2012 నుంచి 2019 వరకు స్టేట్ యూత్ జనరల్ సెక్రటరీగా పని చేశారు. ప్రగతి నివేదన సభ మీడియా కమిటీ మెంబర్గా కూడా పని చేశారు. 2020 నుంచి టీఆర్ఎస్ పార్టీ స్టేట్ సోషల్ మీడియా కన్వీనర్గా కొనసాగుతున్నారు.