హైదరాబాద్ జనవరి 4 (నమస్తే తెలంగాణ): అధికారంలోకి వచ్చిన మొదటి 10 రోజుల్లోనే 30 లక్షల మంది నిరుద్యోగ యువతను మోసం చేసిన కాంగ్రెస్ సర్కారు నూరు శాతం 420 పార్టీయేనని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మ్యానిఫెస్టోలో చెప్పిన మాటను.. అధికారంలోకి వచ్చాక మార్చేసిందని గురువారం ఒక ప్రకటనలో మండిపడ్డారు.
అధికారం రాకముందు టీఎస్సీఎస్సీని రద్దు చేయాలని ఆందోళనలు చేశారని, ఇప్పుడు చైర్మన్ రాజీనామా చేశాక.. కమిషన్ చైర్మన్ లేకుండా ఉద్యోగాలు ఇవ్వలేమని అన డం మోసం కాదా? అని ప్రశ్నించారు. మెగా డీఎస్సీ, ఫిబ్రవరి 1న గ్రూ ప్ 1 అపాయింట్లు ఇస్తామని మోస్తం చేస్తున్నది కాంగ్రెసే అని చెప్పారు.