హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్కు చెందిన విద్యార్థిని జీఎస్ జోత్స్నకు నీట్ పరీక్షల్లో తొలుత ఇచ్చిన మారులను ఎందుకు తగ్గించారో చెప్పాలని నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ(ఎన్టీఏ)ని హైకోర్టు ఆదేశించింది. మారులను 482 నుంచి 294కి తగ్గించడంపై వివరణ ఇవ్వాలని శుక్రవారం జస్టిస్ కే లక్ష్మణ్, జస్టిస్ సీహెచ్ సుమలతతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. మారుల తగ్గింపుపై జోత్స్న అత్యవసర పిటిషన్ దాఖలుచేశారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది అర్జున్కుమార్.. సెప్టెంబర్ 7న వెలువడిన నీట్ ఫలితాల్లో 482 మారులు వచ్చాయని, కాళోజీ విశ్వవిద్యాలయ వెబ్సైట్లో 294కి తగ్గినట్టు పేరొన్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఎన్నిసార్లు ఈమెయిల్ చేసినా సంబంధిత విభాగం నుంచి సమాధానం లేదని చెప్పారు. దీనిపై ఈ నెల 11న జరిగే విచారణలో వివరణ ఇవ్వాలని ఎన్టీఏ న్యాయవాది కవితా యాదవ్ను ధర్మాసనం ఆదేశించింది.