ములుగు : జిల్లా పర్యటనలో భాగంగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ గురువారం గట్టమ్మ దేవాలయంలో అమ్మవారికి పూజలు చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. వచ్చే ఏడాది (2022) ఫిబ్రవరి 16 నుంచి 19వ తేదీ వరకు జరిగే ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ – గిరిజన జాతర అయిన సమ్మక్క – సారలమ్మ జాతర పనుల పర్యవేక్షణపై మంత్రి సమీక్షిస్తారు.
మంత్రి వెంట జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్, టీఆర్ఎస్ నేతలు గోవింద్ నాయక్, జెడ్పీటీసీ భవాని, స్థానిక ప్రజా ప్రతినిధులు, నేతలు, అధికారులు ఉన్నారు.