హైదరాబాద్, మార్చి 12(నమస్తే తెలంగాణ): దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ కేంద్రంగా ప్రపంచ వరి సదస్సును జూన్ 4-6 వరకు నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ (ఫిలిఫైన్స్) సహకారంతో నిర్వహిస్తున్న ఈ సదస్సులో 28 దేశాల నుం చి దాదాపు 500 మంది వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యాపారులు, అనుబంధ రంగాల ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు. ఈ సదస్సులో వరి రకాల ప్రదర్శనతో పాటు రాష్ట్రానికి సంబంధించి వివిధ ఉత్పత్తుల లభ్యతపై వ్యవసాయశాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇదిలా ఉంటే రైతువేదికల్లో రైతునేస్తం వీడియో కాన్ఫరెన్స్ సేవల్ని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జీ చిన్నారెడ్డితో కలిసి మంత్రి తుమ్మల మంగళవారం ప్రారంభించారు. అన్ని ప్రభుత్వ విభాగాలు, కార్పొరేషన్లకు వస్ర్తాలు, యూనిఫాంలు తప్పనిసరిగా టీఎస్సీవో ద్వారానే కొనుగోలు చేయాలని జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. తయారైన వస్త్రాలను టెస్కో ద్వారా సేకరిస్తున్నట్లు చెప్పారు.