హైదరాబాద్, ఫిబ్రవరి25 (నమస్తే తెలంగాణ): ప్రపంచ చేనేత దినోత్సవం నిర్వహించాలని ఐక్యరాజ్య సమితి, ఇతర ప్రపంచ దేశాలకు వరల్డ్ వీవర్స్ కాన్ఫరెన్స్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఇండోనేషియా బాలిలోని వాంటిలాన్ కన్వెన్షన్ సెంటర్లో చేనేత దినోత్సవ వ్యవస్థాపకుడు యర్రమాద వెంకన్న నేత అధ్యక్షతన జరిగిన వరల్డ్ వీవర్స్ కాన్ఫరెన్స్ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ కాన్ఫరెన్స్లో ఇండియా, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, శ్రీలంక, ఆస్ట్రేలియా తదితర దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కాన్ఫరెన్స్లో వైస్ కన్సోల్ జర్నల్ ఆఫ్ ఇండియా రుచికా బిస్త్, బాలి టూరిజం బోర్డ్ హెడ్ రాయ్ సూర్యవిజయ, ఇండోనేషియా ఫ్యాషన్ వీక్ వ్యవస్థాపకరాలు పాపి దర్షనో, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు ఇంద్ర ఉదయాన, గజం అంజయ్య తదితరులు పాల్గొన్నారు.