DGP | ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని డీజీపీ కార్యాలయంలో పోలీస్ హోసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, డీజీపీ అంజనీ కుమార్తో సహా పలువురు సీనియర్ పోలీస్ అధికారులు మొక్కలు నాటారు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ జన్మదినం సందర్భంగా ఆయనకు పోలీసు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ డీజీలు రాజీవ్ రతన్, సంజయ్ కుమార్ జైన్, ఐజీలు కమల్ హాసన్రెడ్డి, ఎం రమేశ్, శివకుమార్ పాల్గొన్నారు.