హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని పీవీ మార్గ్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేస్తున్న 125 అడుగుల డాక్టర్ అంబేద్కర్ కాంస్య విగ్రహం పనులు ఈ ఏడాది డిసెంబర్ కల్లా పూర్తవుతాయని పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు వెల్లడించారు. అదేవిధంగా 11 ఎకరాల విస్తీర్ణంలో రూ.150 కోట్లతో అంబేద్కర్ ప్రాంగణాన్ని తీర్చిదిద్దుతున్నామని వివరించారు. ట్యాంక్బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహ పనులను షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్తో కలిసి మంత్రి కేటీఆర్ పరిశీలించారు. సంబంధిత అధికారులను అడిగి పనుల పురోగతిని తెలుసుకొన్నారు. పలు సలహాలు, సూచనలు ఇచ్చారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చూపిన బాటలో ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు సాగుతున్నారని, సబ్బండ వర్ణాల అభ్యున్నతికి పాటుపడుతున్నారని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు కొనియాడారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ రాష్ట్రం అవతరించిందని, కేసీఆర్ మహోన్నత ఉద్యమం నడిపి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారని వివరించారు.
అంబేద్కర్ చూపిన బాటలో నడుస్తూ ప్రజలందరి సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్టు మంత్రి కేటీఆర్ చెప్పారు. తెలంగాణలో ఇప్పుడు అభివృద్ధి ఉ ద్యమం నడుస్తున్నదని, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని వివరించారు. అన్ని అంశాలలో తెలంగాణ దేశానికే దిక్సూచిగా మారిందన్నారు. పీవీమార్గ్లో ఏర్పాటు చేయనున్న అంబేద్కర్ 125 అడుగల కాంస్య విగ్రహం దేశానికే తలమానికంగా నిలుస్తుందని వివరించారు. విగ్రహంతోపాటు మ్యూజి యం, గ్రంథాలయం, ఫొటో గ్యాలరీ, ధ్యానమందిరం, మీటింగ్ హాళ్లు, క్యాంటీన్లను ఏర్పాటుచేస్తామని వెల్లడించారు.
డిసెంబర్లోగా పనులన్నీ పూర్తవుతాయని పేర్కొన్నారు. మంత్రుల వెంట ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, సండ్ర వెంకటవీరయ్య, చిరుమర్తి లింగయ్య, కాలె యాద య్య, దివాకర్రావు, క్రాంతికిరణ్, ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్, స్థానిక కార్పొరేటర్ విజయారెడ్డి, బీసీ కమిషన్ సభ్యు డు కిశోర్గౌడ్, టీఆర్ఎస్ నేతలు మహ్మద్ సలీం, రావుల విజయ్కుమార్ తదితరులు ఉన్నారు.