ప్రవాస భారతీయుల హక్కుల సంక్షేమ వేదిక
వ్యవస్థాపక అధ్యక్షుడు కోటపాటి సూచన
ఆర్మూర్, జూలై 27: తెలంగాణ యువకులు వర్క్ పర్మిట్ ఉంటేనే గల్ఫ్ దేశాలకు వెళ్లాలని ప్రవాస భారతీయ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కోటపాటి నర్సింహనాయుడు, ఓమన్ తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడు గుండేటి గణేశ్ అ న్నారు. బుధవారం వారు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో మీడియాతో మాట్లాడారు.
ఈ మధ్యకాలంలో ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన అనేకమంది యువకులు విజిట్ వీసాలపై గల్ఫ్ దేశాలకు వెళ్లి ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పనికి సంబంధించిన వీసా లేకపోతే అక్కడి చట్టం ప్రకారం నేరమవుతుందన్నారు. యువకులు గల్ఫ్ ఏజెంట్ల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు.