హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మంజూరుచేసిన ఎనిమిది వైద్య కళాశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఫస్టియర్ క్లాసులు ప్రారంభించేందుకు వీలుగా నిర్మాణ పనులను వేగవంతంచేయాలని రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, నాగర్కర్నూల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి జిల్లాల్లో నిర్మిస్తున్న మెడికల్ కాలేజీల భవన నిర్మాణాల పనులు ఏప్రిల్లో పూర్తి అవుతాయని, ఫస్టియర్ క్లాసుల నిర్వహణకు సిద్ధం చేస్తామని చెప్పారు. రామగుండం కాలేజీ నిర్మాణ పనులు జూన్ నాటికి పూర్తవుతాయని పేర్కొన్నారు. కాలేజీ భవనాల నిర్మాణ పనులపై గురువారం ఆయన మంత్రుల నివాస సముదాయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) నిబంధనల ప్రకారం నిర్మాణ పనులు పూర్తిచేయాలని, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని మంత్రి సూచించారు. మొదటి సంవత్సరం క్లాసుల నిర్వహణకు అవసరమైన మౌలికవసతుల ఏర్పాటు కోసం టీఎస్ఎండీసీతో సమన్వయం చేసుకోవాలని రోడ్లు, భవనాలశాఖ ఈఎన్సీ గణపతిరెడ్డిని ఆదేశించారు. సమావేశంలో రోడ్లు భవనాలశాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, ఈఎన్సీ గణపతిరెడ్డి, సీఈ సతీశ్, మంత్రి పీఎస్ ముకుందరెడ్డి పాల్గొన్నారు.
ఏప్రిల్ నాటికి సిద్ధమయ్యే మెడికల్ కాలేజీలుమంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, నాగర్కర్నూల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి