జేపీఎస్లకు మంత్రి ఎర్రబెల్లి సూచన
హైదరాబాద్, మార్చి 26 (నమస్తేతెలంగాణ): గ్రామపంచాయతీ కార్యదర్శుల(జేపీఎస్)కు రెట్టింపు కంటే ఎక్కువ జీతాలు రానున్నాయని.. దీంతోవారు రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సూచించారు. కొత్తగా నియామకమైన కార్యదర్శులకు రెగ్యులర్ కార్యదర్శుల వేతనాలతో సమానంగా పెంచుతున్నట్టు అసెంబ్లీలో ప్రకటించిన సీఎం కేసీఆర్కు మంత్రి ఎర్రబెల్లి ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయంతో 9 వేల మందికిపైగా కార్యదర్శులకు లబ్ధి జరుగుతుందని చెప్పారు. ప్రొబేషనరీ పీరియడ్ను నాలుగేండ్లకు పెంచడానికి గల కారణాలను కూడా సీఎం వివరించారని తెలిపారు. పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతానికి గ్రామకార్యదర్శుల పనితనమే కారణమని చెప్పారు.