కరీంనగర్ : ఆడబిడ్డల సంతోషమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శుక్రవారం కరీంనగర్ పట్టణంలోని రాంనగర్ మహిళా సంఘ భవనంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డల సంతోషమే ధ్యేయంగా అద్భుతమైన పథకాలు అమలు చేస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బతుకమ్మ కానుకగా చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టామన్నారు.
పువ్వులను దేవతలుగా భావించి పండుగ జరుపుకునే పద్ధతి ప్రపంచం ఎక్కడా లేదన్నారు. గతంలో నీటి కోసం, కరెంటు కోసం ఇబ్బందులు పడేవారమన్నారు. నేడు ఆ పరిస్థితులు లేవని మంత్రి గుర్తు చేశారు.
కార్యక్రమంలోజిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్, నగర మేయర్ వై. సునీల్ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూప రాణి, కార్పొటర్ బోనాల శ్రీకాంత్, గుగ్గిళ్ల జయశ్రీ, కోఆప్షన్ మెంబెర్ నందిల్ల రమ, తహసీల్దార్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.