హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): సృష్టికి మూలం స్త్రీమూర్తి అని, మహిళలంతా ప్రకృతి పరిరక్షణకు గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా మొక్కలు నాటాలని విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ పిలుపునిచ్చారు. శనివారం బీఆర్కే భవన్లోని ఆమె కార్యాలయంలో మార్చి 8ని పురస్కరించుకొని ఉమెన్స్ డే గ్రీన్ ఇండియా చాలెంజ్ పోస్టర్ను ఆవిష్కరించారు. మహిళా అధికారులంతా విరివిగా మొక్కలు నాటాలని సూచించారు.