హైదరాబాద్ : కాంగ్రెస్ వచ్చింది కరువును తెచ్చింది అనే మాట రాష్ట్రంలో రోజు ఏదో ఒక చోట నిరూపిత మవుతూనే ఉంది. రేవంత్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలు సాగు, తాగు నీళ్ల (Drinking water) కోసం అరిగోస పడుతున్నారు. తాజాగా మంత్రి శ్రీధర్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న మంథని నియో జకవర్గంలో Manthani constituency) పది రోజులుగా మిషన్ భగీరథ(Mission Bhagiratha) నీరు రావడం లేదని మహిళలు ఖాళీ బిందెలతో నిరసన(Women protested) తెలిపారు.
భూపాలపల్లి – కాటారం మండలంలోని ఇబ్రహీంపల్లి గ్రామ ఎస్సీ కాలనీ మహిళలు గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పది రోజులుగా తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నామన్నారు. అధికారులు, నాయకుల దృష్టికి తీసుకెళ్లినా పట్టిం చుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి ట్యాంకర్లతో నైనా తాగునీరు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.