తాంసి, మే 07 : కాంగ్రెస్ పాలనలో తాగు, సాగునీటి కష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గుక్కెడు నీళ్ల కోసం జనం రోడ్లమీదకు వచ్చ పోరాడాల్సిన దుస్థితి నెలకొంది. తాజాగా ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం పొన్నారి ఎస్సీ కాలనీలో తాగునీటి సమస్యను(Drinkig water) పరిష్కరించాలంటూ మహిళలు ఆందోళన (Women protest) చేపట్టారు. ఖాళీ బిందెలతో గ్రామపంచాయతీ కార్యాలయానికి(Gram Panchayat) చేరుకొని నిరసన తెలిపారు.
తమ కాలనీకి నేటి సరఫరా ఎందుకు చేయడం లేదంటూ సిబ్బందిని నిలదీశారు. రెండు రోజుల నుంచి మంచినీటి పైపులైను సమస్య కారణంగా కాలనీకి తాగునీరు సరఫరా కావడం లేదు. అధికారులు సైతం ఈ విషయంలో నిర్లక్ష్యం వ్యవహరించడంతో ఆగ్రహానికి గురైన మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. మంచినీటి ట్యాంకర్లను పంపించి అధికారుల సమస్యల పరిష్కరించారు.