న్యాల్కల్, ఆగస్టు 26: సంగారెడ్డి జిల్లా న్యా ల్కల్ మండలం మిర్జాపూర్(బీ) వద్ద ఆర్టీసీ బస్సులో నిండు గర్భిణీ ప్రసవించి మగబిడ్డకు జన్మనిచ్చింది. జహీరాబాద్ ఆర్టీసీ డిపో అధికారులు, మిర్జాపూర్(బీ) కమ్యూనిటీ హెల్త్ సెంట ర్ (సీహెచ్సీ) దవాఖాన సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం పోట్పల్లి గ్రామానికి చెందిన హాజీపాషా భార్య జరీనాబేగంతో కలిసి బీదర్ దవాఖానకు వెళ్లేందుకు శుక్రవారం రాత్రి జహీరాబాద్ ఆర్టీసీ బస్టాండ్లో బస్సు ఎక్కారు.
జరీనాబేగంకు నెలలు నిండి బస్సులో వెళ్తున్న క్రమంలో పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. డ్రైవర్ ఆనందం, కండక్టర్ కరుణాకర్ సమయస్ఫూర్తితో మార్గమధ్యంలో న్యాల్కల్ మండలంలోని మిర్జాపూర్(బీ) గ్రామంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్సీ)కు తరలించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న నర్సు సుధారాణి బస్సు వద్దకు వచ్చేలోపు జరీనాబేగం బస్సులో నే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవం అనంతరం బస్సులో నుంచి దవాఖానకు తీసుకెళ్లి వైద్యం చేశారు. తల్ల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని దవాఖాన వైద్యాధికారులు తెలిపారు.