హైదారాబాద్ : జగిత్యాల(Jagityala) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సోమవారం హోలి వేడుకల్లో( Holi celebrations) గాయపడిన మహిళ చికిత్స పొందుతూ మృతి(Woman dies) చెందింది. ఈ విషాదకర సంఘటన జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేట గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. హోలి పండుగ సందర్భంగా జోగు ప్రకాష్ అనే యువకుడు మేడిశెట్టి రమ ఇంటి ముందు కోడిగుడ్లు విసిరాడు.
ఇలా ఎందుకు చేశావని సదరు మహిళ ప్రశ్నించింది. దీంతో ప్రకాష్ కోపంతో మహిళపై కొడవలితో దాడి చేసి గాయపరిచాడు. వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు దవాఖానకు తరలించారు. కాగా, చికిత్స పొందుతూ రమ మంగళవారం మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.