నల్లగొండ : తాళం వేసిని ఓ ఇంట్లో మహిళ మృతదేహం లభ్యమైంది. మిర్యాలగూడ అశోక్నగర్లోని ఓ ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ ఇంటి వద్దకు చేరుకుని తలుపులు తెరిచి చూడగా, కుళ్లిన స్థితిలో మహిళ మృతదేహం లభ్యమైంది.
మృతురాలిని రాజ్యలక్ష్మి(45)గా పోలీసులు గుర్తించారు. రాజ్యలక్ష్మి భర్త కాంతారావు పరారీలో ఉన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నెల రోజుల క్రితం రాజ్యలక్ష్మి, కాంతారావు ఈ ఇంట్లో కిరాయికి దిగినట్లు స్థానికులు తెలిపారు.