సూర్యాపేట జిల్లాలో దారుణం జరిగింది. న్యూడ్ ఫొటోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానంటూ ఓ మహిళపై కాంగ్రెస్ నాయకుడు వేధింపులకు పాల్పడ్డాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ బెదిరింపులు ఎక్కువ కావడంతో.. మనస్తాపానికి గురైన ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది.
బాధితురాలి కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం బక్కమంతులగూడెంకు చెందిన మహిళను కాంగ్రెస్ నాయకుడు చింతారెడ్డి విజయభాస్కర్రెడ్డి వేధించాడని బాధితురాలు ఆరోపించింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో నిందితుడు ఇంట్లోకి ప్రవేశించి తన నగ్న చిత్రాలను తీసినట్లు పేర్కొంది. ఆ తర్వాత వాట్సాప్ ద్వారా అసభ్యకరమైన సందేశాలు పంపుతూ వేధించాడని తెలిపింది. తన నగ్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరించినట్లు బాధితురాలు ఆరోపించింది.
వేధింపులతో తీవ్రంగా ఇబ్బందిపడిన మహిళ పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. అయితే నిందితుడు అధికార పార్టీకి చెందిన నాయకుడు కావడంతో పోలీసులు చర్యలు తీసుకోవడంలో వెనుకంజ వేస్తున్నారని ఆమె ఆరోపించింది. అంతేకాకుండా నిందితుడితో రాజీ చేసుకుని ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని పోలీసులు తనపై ఒత్తిడి తెచ్చారని బాధితురాలు ఆరోపించినట్లు తెలుస్తోంది.
సూర్యాపేట జిల్లాలో దారుణం
నీ న్యూడ్ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ కాంగ్రెస్ నాయకుడి వేధింపులు
నిందితుడి వేధింపులు, పోలీసుల బెదిరింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం చేసిన బాధితురాలు
సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం బక్కమంతులగూడెంలో దారుణం
ఓ మహిళపై కాంగ్రెస్ నేత చింతారెడ్డి… pic.twitter.com/Hw5nIjjIuo
— Telugu Scribe (@TeluguScribe) September 6, 2026
నిందితుడి వేధింపులతో పాటు పోలీసుల నుంచి ఎదురైన ఒత్తిడితో తీవ్ర మనస్తాపానికి గురైన బాధితురాలు ఆత్మహత్యకు యత్నించింది. కాగా, ఇదే తరహాలో విజయభాస్కర్రెడ్డి మరో ఆరుగురు మహిళలను కూడా వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయని బాధితురాలి వర్గాలు చెబుతున్నాయి.