సంగారెడ్డి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్తో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన అందోల్ మండలం చందంపేట గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..గ్రామానికి చెందిన
మంగలి యాదయ్య (24) చాకలి విఠల్ (25) పొలం వద్ద కూరగాయలు తెంపడానికి వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. ఇద్దరి మృతితో గ్రామంలో నెలకొన్న విషాదఛాయలు నెలకొన్నాయి.