Nirmal | నిర్మల్ అర్బన్, మే 12: సీఎం కేసీఆర్ సారథ్యంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి కృషితో నిర్మల్ జిల్లా ప్రజల చిరకాల కోరిక నెరవేరబోతున్నది. నిర్మల్ జిల్లాలో ఏర్పాటు కానున్న ప్రభుత్వ మెడికల్ కళాశాలకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ)అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు 100 మెడికల్ సీట్లతో ప్రవేశాలకు అంగీకారం తెలిపింది. అనుమతులపై హర్షం వ్యక్తం చేసిన ఇంద్రకరణ్రెడ్డి.. కాలేజీ మంజూరు చేసిన సీఎం కేసీఆర్, ప్రత్యేక చొరవ చూపిన వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావుకు కృతజ్ఞతలు తెలిపారు.
2023-24 విద్యాసంవత్సరం నుంచి మెడికల్ కళాశాలలో తరగతులు ప్రారంభయ్యే అవకాశాలు ఉన్నాయని శుక్రవారం ఆయన ప్రకటనలో పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు మెడికల్ కాలేజీ మంజూరు చేయించినట్టు తెలిపారు. నిర్మల్లో మెడికల్ కాలేజీ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ఉత్తర్వులు జారీ చేయడంతోపాటు నిధులను కేటాయించిందని గుర్తు చేశారు. కళాశాల నిర్మాణానికి ప్రభుత్వం స్థలం కేటాయించగా, శరవేగంగా పనులు కొనసాగుతున్నాయని మంత్రి వివరించారు.