హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): పెట్టుబడుల ఆకర్షణలో శరవేగంగా దూసుకుపోతున్న తెలంగాణ.. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)ల ఏర్పాటుకు పారిశ్రామికవాడల (క్లస్టర్ల)ను అభివృద్ధి చేయడంలోనూ సత్తా చాటుతున్నది. ఎంఎస్ఎంఈ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (సీడీపీ) కింద రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 19 ఇండస్ట్రియల్ పార్కులను అభివృద్ధి చేస్తూ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో పంజాబ్ (18), మధ్యప్రదేశ్ (11), ఉత్తరప్రదేశ్ (10), తమిళనాడు (9) ఉన్నాయి. ఇతర రాష్ర్టాలతో పోలిస్తే గత ఐదేండ్లలో మన రాష్ట్రంలోనే అత్యధికంగా పారిశ్రామికవాడల అభివృద్ధి జరుగుతుండటం గమనార్హం. జిల్లాలవారీగా లభ్యమయ్యే ముడి సరుకులు, వాటితో తయారయ్యే ఉత్పత్తులకు పరిసర ప్రాంతాల్లో ఉన్న గిరాకీని బట్టి దేశవ్యాప్తంగా సీడీపీని అమలు చేస్తున్నారు. ఎంఎస్ఎంఈల ఏర్పాటు కోసం 50 ఎకరాలు లేదా అంతకన్నా తక్కువ భూమిలో ఇండస్ట్రియల్ పార్కులను అభివృద్ధి చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం.
రాష్ట్రంలో ఏర్పాటవుతున్న ఎంఎస్ఎంఈ క్లస్టర్లు