Kotha Prabhakar Reddy | దుబ్బాక టౌన్/దుబ్బాక, నవంబర్ 2: త్వరలో మీ ముందుకొస్తానని, ప్రజలు, కార్యకర్తలు ఎవరూ టెన్షన్ పడొద్దని, భగవంతుని దయ వల్ల ప్రాణాపాయం తప్పిందని మెదక్ ఎంపీ, దుబ్బాక అసెంబ్లీ బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు. దుండగుడి చేతిలో హత్యాయత్నానికి గురై సికింద్రాబాద్ యశోద దవాఖానలో చికిత్స పొందుతూ కోలుకుంటున్న ఆయన.. గురువారం సాయంత్రం దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు తన సందేశాన్ని అందించారు.
‘భగవంతుని దయ వల్ల, ప్రజల ఆశీస్సులతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డ. ఇప్పుడిప్పుడే దవాఖానలో కోలుకుంటున్న. మరో వారం రోజుల్లో మీ ముందుకు వస్తా. నియోజకవర్గ ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు నా గురించి ఎవ్వరూ కూడా టెన్షన్ పెట్టుకోవద్దు. త్వరలోనే మీ ముందుకు వస్తా’నని కొత్త ప్రభాకర్రెడ్డి తెలిపారు.