హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఉగాది నుంచి కాలచక్రం తిరిగి మొదలవుతుందని, చెట్లు చిగురిస్తూ ప్రకృతిలో నూతనోత్తేజం నెలకొంటుందని పేర్కొన్నారు. వ్యవసాయ పనులను రైతన్నలు ఉగాది నుంచే ప్రారంభిస్తారని అందువల్ల ఉగాదిని వ్యవసాయ నామ సంవత్సరంగా పిలుచుకుంటామని తెలిపారు. ప్రజల జీవితాల్లో వసంతాన్ని నింపి, క్రోధినామ సంవత్సరంలో ప్రజలు ప్రశాంతంగా జీవించేలా దీవించాలని ప్రకృతిమాతను ప్రార్థించారు.