రంగారెడ్డి : తెలంగాణలో నిరంతరంగా పెట్టుబడులు పెట్టే యోచనలో ఉన్నామని విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్జీ తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని ఈ – సిటీలో విప్రో కన్స్యూమర్ కేర్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం సందర్భంగా అజీమ్ ప్రేమ్జీ మాట్లాడారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వెరీవెరీ ఛార్మింగ్ అని ప్రేమ్జీ ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు ప్రోత్సాహకంగా ఉందని కొనియాడారు. కరోనా నియంత్రణలో తెలంగాణ కీలకంగా నిలిచిందన్నారు. పెట్టుబడులతో స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించుకుంటున్నామని పేర్కొన్నారు. తాము స్థాపించబోయే కంపెనీల్లో మహిళలకు ఎక్కువ అవకాశాలు కల్పిస్తామని ప్రేమ్జీ తెలిపారు.
మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని ఈ – సిటీలో విప్రో కన్స్యూమర్ కేర్ ఫ్యాక్టరీని ఆ సంస్థ చైర్మన్ అజీమ్ ప్రేమ్ జీతో కలిసి మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా అజీమ్ ప్రేమ్జీని మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి శాలువాతో సత్కరించి సన్మానించారు.