హైదరాబాద్: మద్యం ప్రియులకు షాకింగ్ న్యూస్. అసెంబ్లీ ఎన్నికల (Assembly ELections) నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజులపాటు మద్యం దుకాణాలు బంద్ (Wine shops) కానున్నాయి. ఈ నెలాఖరులో వరుసగా మూడు రోజులు పాటు ‘డ్రై డే’గా పాటించనున్నారు. ఈ నెల 30 పోలింగ్ నిర్వహించనున్నారు. దీంతో ఆ రోజుతోపాటు నవంబర్ 28, 29 తేదీల్లో రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాలు, బార్లు మూసివేస్తారు. మళ్లీ డిసెంబర్ 1న వైన్ షాపులు తెరచుకోనున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం(CEC) ఆదేశాల మేరకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మూడు రోజులపాటు మద్యం విక్రయాలు జరగకుండా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నది. దీనికి సంబంధించి బార్లు, వైన్ షాపుల యజమానులకు ముందస్తు సమాచారం ఇవ్వాలని సూచించింది.