హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. బుధవారం తెల్లవారుజామున కురిసిన అకాల వర్షం అన్నదాతలకు తీరని నష్టం తెచ్చిపెట్టింది. భారీ వర్షాలకు పంటలు నేలకొరిగాయి. కల్లాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. ఈదురు గాలులకు పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.
నల్లగొండ, సిద్దిపేట, జగిత్యాల జిల్లాల్లో పిడుగులు పడటంతో ఇద్దరు మరణించగా, రెండు కాడెద్దులు, 43 మేకలు మృతిచెందాయి. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నగరాన్ని వర్షం ముంచెత్తింది. ఈదురు గాలులతో పలుచోట్ల చెట్లు, ఫ్లెక్సీలు విరిగిపడ్డాయి. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
రోడ్లపై భారీగా నీరు నిలిచిపోయింది. వెంటనే రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ సిబ్బంది సహాయక చర్యలను ముమ్మరం చేసింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిముద్దవడంతో.. రైతులు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. భారీ వర్షానికి రహదారులు చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నల్గొండ, సిద్దిపేట జిల్లాల్లో పిడుగుపడి ఇద్దరు మృతి చెందారు.
జయశంకర్ భూపాల పల్లి జిల్లాలో..
యాదాద్రి భువనగిరి జిల్లాలో..
నల్లగొండ జిల్లాలో..
మంచిర్యాల జిల్లాలో..
సిద్దిపేట జిల్లాలో..
హైదరాబాద్ నగరంలో..