హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తేతెలంగాణ): దసరా పర్వదినం సందర్భంగా మీరు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించనున్నారా? కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి సొంతూళ్లకు వెళ్లనున్నారా? అయితే మీరు నగదు బహుమతులు గెలుపొందే అవకాశాన్ని టీఎస్ఆర్టీసీ కల్పిస్తున్నది. అందుకు మీరు చేయాల్సిందల్లా ఒకటే.. ప్రయాణం పూర్తయ్యాక టికెట్ వెనుకాల మీ పూర్తి పేరు, ఫోన్ నంబర్ను రాసి డ్రాప్ బాక్సుల్లో వేయడమే. రాఖీ పౌర్ణమి మాదిరిగానే విజయదశమి పర్వదినాన కూడా ప్రయాణికులకు లకీడ్రా నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేయాలని ఆర్టీసీ నిర్ణయించింది.
ఈ లకీడ్రాలో గెలుపొందిన ప్రయాణికులకు మొత్తంగా రూ.11 లక్షల విలువైన నగదు బహుమతులను అందించనున్నది. 11 రీజియన్లలో ఐదుగురు పురుషులు, ఐదుగురు మహిళల చొప్పున 110 మందిని ఎంపిక చేసి ఒకొకరికీ రూ.9,900 చొప్పున నగదు బహుమతులను ఇవ్వనున్నది. ఈ నెల 21 నుంచి 23 వరకు, మళ్లీ 28 నుంచి 30 వరకు టీఎస్ఆర్టీసీ బస్సు సర్వీసుల్లో ప్రయాణించే వారందరూ ఈ లకీ డ్రాలో పాల్గొనవచ్చు. ముందస్తు రిజర్వేషన్ చేసుకున్న వారూ అర్హులేనని అధికారులు తెలిపారు. ఆయా రోజుల్లో ప్రయాణించిన వారు తమ టికెట్ వెనుక పేరు, ఫోన్ నంబర్ రాసి డ్రాప్ బాక్సుల్లో వేయాలి.
బస్టాండ్లు, ప్రయాణికుల రద్దీ ప్రాంతాల్లో పురుషులు, మహిళలకు వేర్వేరుగా డ్రాప్బాక్స్లను సంస్థ ఏర్పాటు చేయనున్నది. ప్రతి రీజియన్ పరిధిలో అధికారులు లకీడ్రా నిర్వహించి విజేతలకు నగదు బహుమతులను అందజేస్తారు. సెప్టెంబర్ 31న రాఖీ పండుగ సందర్భంగా టీఎస్ఆర్టీసీ లకీ డ్రా నిర్వహించి 33 మంది మహిళా ప్రయాణికులకు రూ.5.50 లక్షల నగదు పురసారం అందజేసి ఘనంగా సతరించింది.
బతుకమ్మ, దసరా పండుగలకు సొంతూళ్లకు వెళ్లే వారి కోసం టీఎస్ఆర్టీసీ 5,265 ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేయనున్నట్టు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఈ నెల 13 నుంచి 24 వరకు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ప్రయాణికుల రద్దీని బట్టి మరిన్ని సర్వీసులను నడపాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. రాఖీపౌర్ణమిలాగే దసరా పర్వదినం సందర్భంగా ప్రయాణికులకు లకీడ్రా నిర్వహించి నగదు బహుమతులను అందజేయనున్నట్టు పేర్కొన్నారు. దసరాతోపాటు దీపావళి, సంక్రాంతి తదితర పర్వదినాలకు లకీడ్రా నిర్వహిస్తామని చెప్పారు. పూర్తి వివరాలకు ఆర్టీసీ కాల్సెంటర్ నంబర్లలో 040-69440000, 040-23450033 సంప్రదించాలని పేర్కొన్నారు.