ఎమ్మెల్యేలు జైపాల్యాదవ్, ప్రకాశ్గౌడ్
ఎల్బీనగర్, జూన్ 13: రైస్ మిల్లర్ల సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తామని కల్వకుర్తి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, టీ ప్రకాశ్గౌడ్ చెప్పారు. చంపాపేటలోని సామ సరస్వతి గార్డెన్లో జరిగిన హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల రైస్ మిల్లర్ల అసోసియేషన్ నూతన కార్యవర్గ పదవీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఎమ్మెల్యేలు ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల రైస్ మిల్లర్ల అసోసియేషన్ వారు బాధ్యత తీసుకొని కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టే విధంగా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.
తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి సంస్థ చైర్మన్, రైస్ మిల్లర్ల అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు అమరావతి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. రైస్ మిల్ ఇండస్ట్రీని కాపాడుకోవడానికి మంత్రుల ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషిచేస్తామన్నారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గంప నాగేందర్, ప్రధాన కార్యదర్శి టీ మోహన్రెడ్డి, సీనియర్ నాయకులు కాంతారావు, క్యామ మల్లేశ్, గణేశ్ గుప్తా, అసొసియేషన్ ఉపాధ్యక్షుడు తాటిశెట్టి నవీన్కుమార్, తోట వెంకయ్య, వూరె శ్రీనివాస్, పాల మధుసూదన్, బచ్చు నిర్మలేశ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆగిని రవికుమార్ గుప్తా, మంచికంటి రాంచంద్రయ్య, సంయుక్త కార్యదర్శులు ఆకుతోట జగన్, ఆలంపల్లి శ్రీనివాస్, రాధావివేకానంద గుప్తా, గార్లపాటి గణేశ్, మలిపెద్ది శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు దండు రాహుల్, మంచుకొండ విష్ణువర్ధన్, బీ శ్రావణ్కుమార్, కోఆర్డినేటర్ వూరె లక్ష్మణ్, గార్లపాటి జితేందర్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా ప్రమాణ స్వీకారం
రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హైదరాబాద్, రం గారెడ్డి జిల్లాల నూతన కార్యవర్గ అధ్యక్షుడిగా ప్రొ ద్దుటూరి రవీందర్, ప్రధాన కార్యదర్శిగా రాముని రామనాథం, కోశాధికారిగా నరేశ్కుమార్ గోయల్తోపాటు కార్యవర్య సభ్యులు ప్రమాణం స్వీకరించారు. ఈ సందర్భంగా రైస్ మిల్లర్లు నూతన కా ర్యవర్గ సభ్యులను, అతిథులను సన్మానించారు.