హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): జర్నలిస్టులు కూడా ఎంప్లాయీస్ హెల్త్ సీం (ఈహెచ్ఎస్) పరిధిలోకే వస్తారని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. ఈహెచ్ఎస్ను జర్నలిస్టులకు కూడా పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు తీసుకొంటామని హామీ ఇచ్చారు. జర్నలిస్టు యూనియన్ ప్రతినిధులు గురువారం అరణ్య భవన్లో హరీశ్రావుతో సమావేశమై జర్నలిస్టులకు ప్రభుత్వం జారీచేసిన హెల్త్ కార్డులను కార్పొరేట్ దవాఖానలు తిరసరిస్తున్న విషయాన్ని వివరించారు. త్వరలోనే ఈ సమస్యను పరిషరిస్తామని, పథకం అమలు పర్యవేక్షణకు మానిటరింగ్ సెల్ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీంతో మంత్రి హరీశ్రావుకు ఐజేయూ అధ్యక్షుడు కే శ్రీనివాస్రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వరింగ్ జర్నలిస్టు సంఘం ప్రధాన కార్యదర్శి కే విరాహత్ అలీ తదితరులు కృతజ్ఞతలు తెలిపారు.
జర్నలిస్టుకు హరీశ్రావు ఆపన్నహస్తం
బషీర్బాగ్ కేంద్రంగా పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్టు పుండరీచారి సతీమణి వినోద అనారోగ్యంతో ఉస్మానియాలో చేరగా, ఆశించిన స్థాయిలో చికిత్స అందట్లేదని టీయుడబ్ల్యుజే నేతలు మంత్రికి తెలిపారు. వెంటనే స్పందించిన హరీశ్, వినోదకు ఏఎంసీలో బెడ్ కేటాయించి, మెరుగైన చికిత్స అందించాలని సూపరింటెండెంట్ను ఆదేశించారు.