మేడ్చల్, సెప్టెంబర్ 27(నమస్తే తెలంగాణ): మల్కాజిగిరి నియోజకవర్గంలో మల్లన్న సినిమా చూపిస్తానని, ఇది ట్రైలర్ మాత్రమేనని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మల్కాజిగిరి నియోజకవర్గంలో బుధవారం బీఆర్ఎస్ భారీ ర్యాలీ నిర్వహించింది. అనంతరం జరిగిన సభలో మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. మల్కాజిగిరిలో బీఆర్ఎస్ అభ్యర్థి వచ్చే ఎన్నికల్లో లక్ష మెజార్టీతో గెలవడం ఖాయమని చెప్పారు. కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే కాంగ్రెస్కు డిపాజిట్లు దక్కే పరిస్థితి లేదని చెప్పారు. కాంగ్రెస్ దొంగల ముఠా పార్టీ అని, వారి పాలనలో భూమి నుంచి ఆకాశం దాకా అన్నీ స్కాములేనని విమర్శించారు. కాంగ్రెస్ ప్రజలకు ఎలాంటి మేలు చేయకుండా సత్తెనాశ్ చేసిందని మండిపడ్డారు. ఓటుకు నోటుకు కేసులో జైలుకు పోయిచ్చిన రేవంత్రెడ్డి పీసీసీ అధ్యక్షుడయ్యారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్లో గుండాలు, రౌడీలు, కబ్జాకోరులు ఉన్నారని, రానున్న ఎన్నికల్లో ప్రజలు వారిని తరిమి కొట్టాలని పిలుపు నిచ్చారు.
మంత్రి మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీకి చెందిన పలువురు నాయకులు బీఆర్ఎస్లో చేరారు. బీజేపీ నేతలు ఒరుగంటి నాగకుమారి, విక్రమ్ భరద్వాజ్, విజయకుమారి, బాలమణి, సంతోష్, టీడీపీకి చెందిన మాజీ కౌన్సిలర్ కృష్ణగౌడ్, మురళీధర్రావు, బిల్లు, మాజీ హుడా డైరెక్టర్ వీరేశంయాదవ్, గౌలికర్ రవీందర్, కోటేశ్వర్రావు, మల్లారెడ్డి, జలంధర్రెడ్డి, జనార్దన్రెడ్డి, రాజేశ్వర్రావు తదితరులు బీఆర్ఎస్లో చేరారు.
సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేశారని మంత్రి మల్లారెడ్డి వివరించారు. అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని, వచ్చే ఎన్నికల్లో ఆయనకు ప్రజలు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. మల్కాజిగిరి నియోజకవర్గ అభివృద్ధికి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి హయాంలో తాగునీటి సమస్య పరిష్కరానికి రూ.539 కోట్లు సీఎం కేసీఆర్ మంజూరు చేశారని, రూ.46 కోట్లతో ఆర్యూబీలు నిర్మించామని వివరించారు. నియోజకవర్గంలోని అర్హులందరికీ గృహలక్ష్మి, దళితబంధు పథకాలు వర్తింపజేస్తామని భరోసా ఇచ్చారు. మర్రి రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ.. మల్కాజిగిరి అంటే తనకు ప్రత్యేక అభిమానమని, గత లోక్సభ ఎన్నికల్లో తనకు ఈ సెగ్మంట్లో 72 వేల ఓట్లు వచ్చాయని చెప్పారు. నియోజకవర్గ ప్రజలు తాము అరుంధతి దవాఖానలో ఉచింతంగా అందిస్తున్న వైద్యసేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మల్కాజిగిరి నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి బద్దం పరుశురాంరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దర్గాదయాకర్రెడ్డి, కార్పొరేటర్లు సునీతారాంయాదవ్, మీనాఉపేందర్రెడ్డి, శాంతిశ్రీనివాస్రెడ్డి, మాజీ కార్పొరేటర్ నిరుగొండ జగదీశ్గౌడ్ పాల్గొన్నారు.