కవాడిగూడ, నవంబర్ 25: పార్టీ మారుతున్నానని వస్తున్న వదంతులు అవాస్తవమ ని, ఊపిరి ఉన్నం త వరకు కేసీఆర్తోనే ఉంటానని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి చెప్పారు. డిసెంబర్లో నిర్వహించనున్న ‘చలో ఢిల్లీ’ కార్యక్రమ కరపత్రాన్ని శుక్రవారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రెండుసార్లు ఎమ్మెల్యే టికెట్, రెండుసార్లు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారని అన్నారు.
ఉద్యమంలో కేసీఆర్ అడుగుజాడల్లో నడిచానని, పార్టీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. విద్వేషాలు రెచ్చగొట్టే బీజేపీని అంతం చేయడమే అంతిమ లక్ష్యమని పేర్కొన్నారు. పార్లమెంట్ నూతన భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని, ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలని, తెలంగాణలో మాదిగలకు 12% రిజర్వేషన్ కల్పించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.