రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్
వేల్పూర్, మే 31: రైతుల మేలు కోసం నిరంతరం పోరాడిన దివంగత వేముల సురేందర్రెడ్డి ఆశయ సాధన కోసం కృషి చేస్తామని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ అన్నారు. సోమవారం నిజామాబాద్ జిల్లా వేల్పూర్ ఎక్స్రోడ్డు వద్ద వేముల సురేందర్రెడ్డి విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మొక్కనాటి నీరు పోశారు. ఈ సందర్భంగా సంతోష్కుమార్ మాట్లాడుతూ.. సురేందర్రెడ్డి ఆశయాలను టీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని చెప్పారు. రైతు సంక్షేమంతోపాటు వారి సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్ నిరంతరం శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.