మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు పబ్బతి
హైదరాబాద్, ఆగస్టు 2(నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీని ఓడిస్తామని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు పబ్బతి శ్రీకృష్ణ తెలిపారు. సోమవారం హైదరాబాద్లోని శేరిలింగపల్లిలో జరిగిన మాల మహానాడు ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ దేశంలోని అన్ని ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ప్రభుత్వ ఉద్యోగాలు రాకుండా చేస్తున్నదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ బీజేపీని ఓడించి తగిన బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీ అణగారిన వర్గాలను తీరని అన్యాయం చేస్తున్న బీజేపీ ఏ మొహంపెట్టుకొని హుజూరాబాద్లో పోటీచేస్తుందని ప్రశ్నించారు. బీజేపీని ఓడించటమే లక్ష్యంగా పనిచేయాలని మాలమహానాడు నాయకులకు సూచించారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గ అధ్యక్షుడిగా సంగనమాల వాసు నియమితులయ్యారు.