హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎమ్మార్)లో భాగంగా ఇకపై కేవలం ఫోర్టిఫైడ్ రా రైస్ మాత్రమే తీసుకొంటామని భారత ఆహార సంస్థ(ఎఫ్సీఐ) స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం ఎఫ్సీఐ జనరల్ మేనేజర్ ఉత్తర్వులు జారీ చేశారు.
2021-22 వానకాలం, యాసంగికి సంబంధించిన రా రైస్ను ఈ నెల 7 వరకు స్వీకరిస్తామని పేర్కొన్నారు. ఈ నెల 9 నుంచి పూర్తిగా ఫోర్టిఫైడ్ రా రైస్ మాత్రమే తీసుకొంటామని తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న వానకాలం కొనుగోళ్లకూ ఫోర్టిఫైడ్ రా రైస్ మాత్రమే ఇవ్వాలని స్పష్టంచేశారు.