హనుమకొండ: హనుమకొండలోని (hanamkonda) రెడ్డి కాలనీలో వ్యక్తి హత్యకు గురయ్యాడు. వేధింపులు తాట్టుకోలేక ఓ మహిళ కట్టుకున్న భర్తను ఇనుప రాడ్తో కొట్టి చంపింది. అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయింది. వేధింపులతోనే హత్యచేశానని పోలీసులకు తెలిపింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.