హైదరాబాద్ : కరీంనగర్లో (Karimnagar)దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భర్తను( Husband) భార్య కట్టేసి కొట్టడంతో(Wife beats) మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన జిల్లా కేంద్రంలోని సుభాష్నగర్లో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. కరీంనగర్ ప్రభుత్వ దవాఖానలో పని చేస్తున్న రోహిణి అనే మహిళ భర్తతో తరచూ గొడవ పడుతున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో మరోసారి ఇద్దరి మధ్య గొడవ తలెత్తడంతో రోహిణి భర్తను కట్టేసి తీవ్రంగా హింసించడంతో గురువారం తెల్లవారుజామున మృతి చెందినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.