హైదరాబాద్ నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): రామదూత క్రియేషన్స్ నిర్మించిన వ్యూ హం సినిమాకు సర్టిఫికెట్ జారీ చేయకపోవడంపై వివరణ ఇవ్వాలంటూ సీబీఎఫ్సీకి హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా సినిమాకు సర్టిఫికెట్ జారీ చేయ డం లేదంటూ రామదూత క్రియేషన్స్, చిత్ర నిర్మాత దాసరి కిరణ్ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిని జస్టిస్ సూరేపల్లి నంద శుక్రవా రం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున సీనియర్ లాయర్ నిరంజన్రెడ్డి వాదించారు. సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేయకపోవడం చట్ట వ్యతిరేకమని పేర్కొన్నారు. చిత్ర ప్రదర్శనను నిలిపివేయదలిస్తే ఎన్నికల సంఘమే ఆ నిర్ణ యం తీసుకోవాలని తెలిపారు. వివరాలు తె లుసుకునేందుకు గడువు కావాలని సెన్సార్ బోర్డు తరఫు న్యాయవాది కోరడంతో విచారణను హైకోర్టు ఈ నెల 28కి వాయిదా వేసింది.